.
Home » , » రెమ్యునేషన్ లో సైతం మహేష్ కొత్త రికార్డు?

రెమ్యునేషన్ లో సైతం మహేష్ కొత్త రికార్డు?

Written By Hot nd spicy on Friday, 20 April 2012 | 10:11

మహేష్ బాబు తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినపడుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం కమిటైన మహేష్ ఆ చిత్రానికి గానూ హైయిస్ట్ రెమ్యునేషన్ తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. వారు చెప్పుకునేదాని ప్రకారం తెలుగులో ఏ హీరో తీసుకోనంత రెమ్యునేషన్ అయిన 15 కోట్లు. బూరుగుపల్లి శివరామకృష్ణ ఈ రేంజి రెమ్యునేషన్ తో మహేష్ డేట్స్ తీసుకున్నాడని, ఈ చిత్రంతో తెలుగులో హైయిస్ట్ రెమ్యునేటెడ్ హీరోగా మారిపోయాడని అంటున్నారు. అయితే ఇటువంటి వివరాలు ఎవరూ ఖరారు చేయటానికి కుదరదు. ఎందుకంటే రెమ్యునేషన్ అనేది బయిటకు చెప్పుకునే అంశం కాదు కాబట్టి అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

ఇక బోయపాటి శ్రీను తాను మహేష్ తో చేస్తున్ విషయాన్ని రీసెంట్ గా మీడియా వద్ద కన్ఫర్మ్ చేసి చెప్పారు. అయితే బోయపాటి శ్రీను తీసే సినిమాలకు, మహేష్ సినిమాలుకు చాలా డిఫెరెన్స్ ఉంటుంది. మహేష్ సినిమాలు కాస్త స్మూత్ గా నడిస్తే... బోయపాటి హీరోలు ఎప్పుడూ రఫ్ అండ్ టఫ్ గా బిహేవ్ చేస్తూంటారు. అయితే మహేష్ సైతం మాస్ మాసాలా సినిమాలనుకుంటున్న నేపధ్యంలో బోయపాటి శ్రీనుకి అవకాశమివ్వటం జరిగింది. ఈ నేపధ్యంలో రీసెంట్ గా బోయపాటి శ్రీను.. మహేష్ ని కలిసి ఓ కథని నేరేట్ చేసాడని వినికిడి. కథ అంతా విన్న మహేష్ బాబు.. చెప్పే విధానాన్ని మెచ్చుకుని, తన సినిమాలు ఒక్కసారి చూడమని, తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్లు కథలో మార్పులు చేయమని, డైలాగులు సైతం తనకు అనుగుణంగా మార్చమని సలహా ఇచ్చినట్లు సమాచారం.

అలాగే ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ ని పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూలర్ అనే పదం బాగా పాపులర్ అయ్యిన సంగతి తెలిసిందే. దమ్ము సినిమాలోని ఓ పాటలో ఈ పదం వస్తుంది. అలాగే బాలకృష్ణ అధినాయుకుడు పోస్టర్స్ పై కూడా హి రూల్స్ అని వేస్తున్నారు. ఈ నేపధ్యంలో మహేష్ తదుపరి చిత్రానికి రూలర్ టైటిల్ పెట్టే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దీనికి మరో కారణం బూరుగు పల్లి శివరామకృష్ణ ఈ టైటిల్ ని పిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయటమే. దీనికి కారణం బూరుగు పల్లి శివరామకృష్ణ ఈ టైటిల్ ని పిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయటమే. బూరుగుపల్లి శివరామకృష్ణ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో కమిటయ్యారు.


ఇక నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రస్తుతం దరువు చిత్రం చేస్తున్నారు. రవితేజ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని శౌర్యం శివ డైరక్ట్ చేస్తున్నారు. ‘దరువు’. సౌండ్ ఆఫ్ మాస్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రం మే 4న విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసినట్లు నిర్మాత చెప్తున్నారు. మహేష్ బాబు వరస సినమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత బోయపాటి శ్రీను చిత్రం ఉండనుందని తెలుస్తోంది.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger