తన అన్న మాట నిలబెట్టడం కోసం ఏదైనా చేసే తమ్ముడిగా త్వరలో మహేష్ కనిపించి అలరించనున్నారు. వెంకటేష్,మహేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతోంది. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో దిల్ రాజు చిత్రం గురించి మాట్లాడుతూ ఇందులో మహేష్ బాబు గురించి,తమ సినిమా నేపధ్యం గురించి వివరించారు.
దిల్ రాజు మాటల్లోనే...అన్న వెంటే తమ్ముడు కూడా అడవులు పట్టిపోవడానికి ఇది రామాయణం కాదు. తమ్ముడి కోసం రాజ్యాన్ని ధారబోసే అన్నలూ లేరు. ఆస్తితో అడ్డగీత గీస్తే అనుబంధం రెండు ముక్కలైపోతున్న రోజులివి. ఇప్పుడు కూడా అన్నమాట జవదాటని తమ్ముడున్నాడా? తండ్రి ఇచ్చిన మాట కోసం తమ సర్వస్వం ధారబోసే తనయులు కనిపిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మా సినిమా చూడాలి అన్నారు దిల్ రాజు.
ఉమ్మడి కుటుంబంలో అనుబంధాలూ ఆప్యాయతలూ చూసి ఎంతకాలమైంది? ఉద్యోగం పేరుతో ఒకరు రెక్కలు కట్టుకొని విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇంకొకరిది పట్నవాసం. ఇంటిల్లిపాదీ మళ్లీ కలుసుకోవాలంటే పండగో, పెళ్లిపిలుపో రావాల్సిందే. అప్పుడు కూడా సెలవులు దొరికితేనే! అందుకే బాబాయ్, పిన్ని, వదిన, మేనత్త... ఇలాంటి పిలుపులకు దూరమైపోతున్నాం. ఆరు బయట వెన్నెల్లో కబుర్లు చెప్పుకొనే రోజులు మర్చిపోతున్నాం. మళ్లీ అలాంటి వాతావరణం మా సినిమాలో చూడొచ్చు అని చెప్పుకొచ్చారు.
అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్, మహేష్బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.
వెంకటేష్, మహేష్బాబు హీరోలుగా చేస్తున్న ఈ చిత్రంలో సమంత ..మహేష్ సరసన చేస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో మహేష్బాబు, వెంకటేష్ లపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: గుహన్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
దిల్ రాజు మాటల్లోనే...అన్న వెంటే తమ్ముడు కూడా అడవులు పట్టిపోవడానికి ఇది రామాయణం కాదు. తమ్ముడి కోసం రాజ్యాన్ని ధారబోసే అన్నలూ లేరు. ఆస్తితో అడ్డగీత గీస్తే అనుబంధం రెండు ముక్కలైపోతున్న రోజులివి. ఇప్పుడు కూడా అన్నమాట జవదాటని తమ్ముడున్నాడా? తండ్రి ఇచ్చిన మాట కోసం తమ సర్వస్వం ధారబోసే తనయులు కనిపిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మా సినిమా చూడాలి అన్నారు దిల్ రాజు.
ఉమ్మడి కుటుంబంలో అనుబంధాలూ ఆప్యాయతలూ చూసి ఎంతకాలమైంది? ఉద్యోగం పేరుతో ఒకరు రెక్కలు కట్టుకొని విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇంకొకరిది పట్నవాసం. ఇంటిల్లిపాదీ మళ్లీ కలుసుకోవాలంటే పండగో, పెళ్లిపిలుపో రావాల్సిందే. అప్పుడు కూడా సెలవులు దొరికితేనే! అందుకే బాబాయ్, పిన్ని, వదిన, మేనత్త... ఇలాంటి పిలుపులకు దూరమైపోతున్నాం. ఆరు బయట వెన్నెల్లో కబుర్లు చెప్పుకొనే రోజులు మర్చిపోతున్నాం. మళ్లీ అలాంటి వాతావరణం మా సినిమాలో చూడొచ్చు అని చెప్పుకొచ్చారు.
అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్, మహేష్బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.
వెంకటేష్, మహేష్బాబు హీరోలుగా చేస్తున్న ఈ చిత్రంలో సమంత ..మహేష్ సరసన చేస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో మహేష్బాబు, వెంకటేష్ లపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: గుహన్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment