.
Home » » ఇద్దరిదీ పైచేయిగానే ఉంటుంది : దిల్ రాజు

ఇద్దరిదీ పైచేయిగానే ఉంటుంది : దిల్ రాజు

Written By Hot nd spicy on Sunday, 15 April 2012 | 01:12

టాలీవుడ్ అగ్రహీరోలు వెంకటేష్‌, మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే జూబ్లీహిల్స్‌లోని సినీమ్యాక్స్‌ మాల్‌లో మహేష్‌బాబుపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.

ఇందులో ఇద్దరివీ బ్రహ్మాండమైన పాత్రలే. ఒకరి ఎక్కువ తక్కువ అనేతేడానే లేదు. బయట రకరకాలుగా వార్తలు విన్పిస్తున్నాయి. షూటింగ్‌ జరుగుతుందా? వాయిదా పడుతుందోమోనని పుకార్లు ఫిల్మ్‌నగర్‌లో షికారు చేస్తున్నాయి.

వీటిపై నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... ఈ పుకార్లకు తాను చెప్పే సమాధానం ఒక్కటే. ఇద్దరు అగ్ర హీరోలు చాలా సపోర్ట్‌ ఇస్తున్నారు. అలాంటప్పుడు ఇవన్నీ నమ్మకూడదన్నాడు. ప్రసాద్‌ల్యాబ్స్‌లో కలిసిన ఆయన సూచాయిగా కొన్ని విషయాలు చెప్పాడు.

అన్నదమ్ములుగా ఇద్దరూ నటిస్తున్నారు. ఇద్దరూ ఒకరిని మంచి ఒకరు నటించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇద్దరూ రాష్ట్ర అవార్డులు పొందినవారే. చిత్రంలోని పాయింట్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. తెలుగులో మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ ప్రతి ఒక్కరికీ కలుగుతుంది అన్నారు.

కాగా, తాజాగా ఆయన "తూనీగా తూనీగా" అనే చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఎం.ఎస్‌.రాజు కొడుకు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటిస్తున్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎస్‌.రాజు దర్శకుడు. ఈ కథ చాలా బాగా వచ్చిందనీ, ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంపై తనకు పూర్తి నమ్మకముందని దిల్‌రాజు తెలియజేశారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger