Pages

Tuesday, 24 April 2012

'దమ్ము' బిజినెస్ ఊపుతో బోయపాటితో ఎన్టీఆర్ మరో సినిమా!?

ఎన్‌.టి.ఆర్‌ హీరోగా నటించిన 'దమ్ము' చిత్రం ఊహించని వ్యాపారం చేయడంతో దర్శకుడు బోయపాటి శ్రీనుతోపాటు నిర్మాత కె.ఎస్‌.రామారావు చాలాహ్యాపీగా ఉన్నారు. ఎంతోకాలంగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌లో సినిమాలు లేక... సక్సెస్‌లు రాక డల్‌గా రామారావు ఈ చిత్రం ఇచ్చిన టానిక్‌తో మళ్ళీ బోయపాటి శ్రీనుతో మరో సినిమా తీయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సెన్సార్‌లో చాలా కత్తెరలు పడినా... అక్షయ తృతీయ నాటికి క్లియర్‌ అయింది. దీంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడిలో దర్శకుడు చిత్రయూనిట్‌తో శాంతి చేయించారు. ముఖ్యకారణం ఊహించని విధంగా బిజినెస్‌ కావడమే. శాటిలైట్‌ రైట్సే 6కోట్లు చేసింది.

నైజాంలో 8.5 కోట్లు, ఆంధ్రా. 14.5,సీడెడ్‌ 8.10, బెంగుళూరు 3.25, ఓవర్సీస్‌ 2.25కోట్లు చేసింది. దాదాపు 44 కోట్లపైగా బిజినెస్‌ చేయడంతో ఈ చిత్రం ముందుగా ఊహించినట్లుగా సక్సెస్‌అవుతుందనే ధీమాతో ఉన్నారు.

కాగా, ఈ సినిమా మలయాళం సినిమాకు రీమేక్‌గా పలు వార్తలు వచ్చినా.... మా చిత్రానికి ఏమీ ఇబ్బందిలేదని రామారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది.

No comments:

Post a Comment