.
Home » » 'గబ్బర్ సింగ్' బడ్జెట్? పవన్ రెమ్యునేషన్?

'గబ్బర్ సింగ్' బడ్జెట్? పవన్ రెమ్యునేషన్?

Written By Hot nd spicy on Tuesday, 24 April 2012 | 10:20

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ రోజుకో విశేషంతో మారు మ్రోగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంభందించి పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునేషన్ తీసుకున్నాడనే విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వారు చెప్పుకుంటున్న దాని ప్రకారం....ఈ చిత్రాన్ని పవన్ రెమ్యునేషన్ కాకుండా 18 కోట్లు ఖర్చుతో తీసారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి రెమ్యునేషన్ తీసుకోవటం లేదు. పిఫ్టీ పర్శంట్ సినిమా షేర్ తీసుకుంటున్నాడు.

ట్రేడ్ అంచనాలు ప్రకారం ..పవన్ ఇమేజ్, ఇప్పటికే ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ తో... ఈ చిత్రం ఇప్పటికే 32 కోట్లు థియోటరికల్ రైట్స్ బిజినెస్ చేసింది. అది కాక ఆరు కోట్లు మిగతా రైట్స్ నిమిత్తం వచ్చాయి. దాంతో మొత్తం 38 కోట్లు అయ్యింది. అందులో బడ్జెట్ తీసేస్తే...20 కోట్లు మేకర్స్ కి మిగులుతుంది. దాంట్లో సగం షేర్ అంటే పది కోట్లు..పవన్ కి మిగులుతుందని...అదే రెమ్యునేషన్ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంతో నిర్మాత గణేష్ బాబు టేబుల్ ఫ్రాఫిట్ సంపాదించాడని,తీన్ మార్ తో పోగొట్టుకున్నది తిరిగి పొందాడని చెప్పుకుంటున్నారు.

మే రెండో వారంలో విడుదల అవుతున్న పవన్ తాజా చిత్రం 'గబ్బర్‌సింగ్‌'. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడియో విడుదల అయిన దగ్గరనుంచి ఈ చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎంతగానో యూత్ లో కిక్ ఇచ్చిన 'కెవ్వు కేక' పాట తెరపై ఎలా ఎక్కిందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాక అందరూ ఈ చిత్రంపై పాజిటివ్ గా స్పందించటం జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. సంగీతం:దేవిశ్రీ ప్రసాద్‌.

ఈ చిత్రం గురించి దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ...అతను ఖాకీ కడితేనే పోలీసు. నెత్తి మీద టోపీ ఉన్నంతసేపూ సెక్షన్ల గురించి, చట్టాల గురించి పట్టించుకొంటాడు. లాఠీ పక్కనపెడితే అతనికంటే పెద్ద రౌడీ ఉండడు. కేడీగాళ్లను దారిలోకి తీసుకురావాలంటే... ఈ పద్ధతే సరైనదని అతని నమ్మకం. ఇంతకీ కిలాడీ పోలీసు లక్ష్యమేమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు‌.ముఖ్యంగా ''నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది..'' అనే పంచ్‌ డైలాగులు కారణంగా 'గబ్బర్‌ సింగ్‌'కు హిట్ల తాకిడి ఎక్కువైందని సినిమా యూనిట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger