అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇలియానా హీరోయిన్గా రూపొందుతున్న చిత్రానికి ‘జులాయి’ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణ వైజాగ్లో ఆర్.కె.బీచ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అల్లు అర్జున్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, ఇలియాన క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో అర్జున్ సరసన తొలిసారిగా గోవా బ్యూటీ ఇలియానా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్య ఇటీవల ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని త్రివిక్రం చిత్రీకరించాడు. అందులో అర్జున్, ఇలియానా మధ్య గాఢ చుంబన దృశ్యం కూడా ఉందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. పెళ్లి తర్వాత అర్జున్ పాల్గొన్న తొలి ముద్దు సన్నివేశం ఇదే. సోసూసూద్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న పాటలు మే నెలలో శ్రోతల ముందుకు రానున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Post a Comment