స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా ఎటో వెళ్లిపోయింది మనస్సు షూటింగ్ నిమిత్తం లండన్ కి వెళ్లింది. అక్కడ కటార్ ఎవర్ వేస్ వారి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమె తన లగేజ్ ని పోగొట్టుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ లో తెలియచేసింది. ఆ ఎయిర్ వేస్ వారు తన ట్రిప్ మొత్తం నాశనం చేసారని ట్వీట్ చేసింది. అయితే అందులో తన లగేజ్ తిరిగి సంపాదించుకున్నది లేనిది రాయలేదు.
ఇక అక్కడ షూటింగ్ ఫినిష్ చేసుకుని ఆమె త్వరలోనే హైదరాబాద్ రానుంది. ఈ నెల 30న జరిగే ఈగ ఆడియో పంక్షన్ కి ఆమె హాజరు కానుంది. గచ్చిబౌళి స్టేడియంలోని బ్రహ్మకుమారి అకాడిమి లో ఈ ఆడియో పంక్షన్ గ్రాండ్ గా జరగనుంది. ఈగ చిత్రంలోనూ,ఎటో వెళ్లిపోయింది మనస్సు చిత్రంలోనూ నాని హీరోగా చేస్తున్నారు. రెండు చిత్రాలు ఒకటి రాజమౌళి,మరొకటి గౌతమ్ మీనన్ డైరక్ట్ చేస్తూండటంతో మంచి క్రేజ్ వస్తోంది. ట్రేడ్ లో కూడా ఈ చిత్రాలపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలపాటు మరో మూడు తెలుగు సినిమాలు చేస్తూ సమంత బిజిగా ఉంది.
Post a Comment