Pages

Tuesday, 10 January 2012

చిరంజీవీ... కాంగ్రెస్‌ పార్టీకి నువ్వొక స్టెఫినీ: తలసాని వ్యాఖ్య

చిరంజీవికి బాలయ్యను విమర్శించే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు సామాజిక న్యాయం అని ప్రజలకు చెప్పిన చిరంజీవి, ఆ మాటలను గాలికొదిలేసి పార్టీని కాంగ్రెస్ కు అమ్మేసుకున్నారని విమర్శించింది.

తెదేపా నాయకుడు తలసాని కృష్ణయాదవ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి స్టెఫినీ మాదిరిగా మారిపోయిన చిరంజీవి, పదవుల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ముందు మోకరిల్లి ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు.

పార్టీని టోకున కాంగ్రెస్‌కు అమ్మేసి చిరుజీవిగా మారిన చిరంజీవికి బాలయ్యను విమర్శించే హక్కు లేదని అన్నారు.

No comments:

Post a Comment