అల్లు అర్జున్ తాజాగా తమిళంలోనూ ఎంట్రీ ఇవ్వటానికి రంగం చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శకుడు ఎమ్.రాజేష్ రీసెంట్ గా కథ వినిపించి ఓకే చేసుకున్నట్లు చెప్తున్నారు. ఓకే ఓకే చిత్రంతో తమిళంలో హాట్రిక్ కొట్టిన ఈ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. ఈ మధ్యనే ఓకే ఓకే చిత్రాన్ని అల్లు అర్జున్ చూసి బాగా ఎంజాయ్ చేసాడని సమాచారం.
ఈ మేరకు దర్శకుడు రాజేష్ తమిళ మీడియాతో మాట్లాడుతూ..నేను అల్లు అర్జున్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నాను. త్వరలోనే ఓ షేప్ తీసుకున్న తర్వాత వినిపిస్తాను. నా సినిమాలు అల్లు అర్జున్ చూసి చాలా ఎంజాయ్ చేసానని చెప్పారు. నా కథ అల్లు అర్జున్ కి నచ్చుతుందనే భావిస్తున్నాను అన్నారు.
ఇక ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో ఒకే సారి నిర్మాణం కానుంది. గీతా అర్డ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తారని సమాచారం. ఇక రాజేష్ గతంలో డైరక్ట్ చేసిన ఎస్.ఎమ్ ఎస్ చిత్రం తెలుగులో మహేష్ బాబు బావ సుధీర్ బాబుతో రీమేక్ చేసారు. అలాగే బాస్ ఎనగర్ బాస్కరన్ చిత్రం నేనే అంబాని టైటిల్ తో ఇక్కడ డబ్బింగ్ అయ్యింది. నయనతార,ఆర్య కాంబినేషన్ లో వచ్చిన ఆ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నమోదైంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ తన తాజా చిత్రం జులాయి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పాటలు, ట్రైలర్స్ అందరిలోనూ ఆసక్తిని నింపాయి.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment