.
Home » » రజనీ కూతురు కాపురానికి... కమల్ కూతురు ఎసరు?

రజనీ కూతురు కాపురానికి... కమల్ కూతురు ఎసరు?

Written By Hot nd spicy on Thursday, 5 April 2012 | 11:10

రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కాపురానికి కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఎసరు పెడుతోందా.... తమిళ సినీ వర్గాల నుంచి వార్తలను బట్టి ఇది నిజమేనేమో అనిపిస్తోంది. ‘3’ సినిమాలో ధనుష్, శృతి హాసన్ కలిసి నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ధనుష్ భార్య ఐశ్వర్య.

సినిమాలో ధనుష్, శృతి మధ్య ఘాటైన రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. ఆ రొమాన్స్ కేవలం సినిమాకే పరిమితం కాకుండా నిజజీవితంలోనూ రిపీట్ అవుతున్నాయని, ఇద్దరు ఈ మధ్య చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారనే గుసగుసలు చెన్నయ్‌లో వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఓ సంఘటన ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.

‘3’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ రేడియోలో అభిమానులతో ధనుష్, శృతి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చాట్ షో నిర్వహించారు. అప్పటి వరకు హ్యాపీగా అభిమానులతో చాట్ చేసిన ధనుష్...ఆ షోలోకి తన భార్య, దర్శకురాలు ఐశ్వర్య వచ్చి జాయిన్ కాగానే ఫేస్ అదోలా పెట్టి తలనొప్పిగా ఉదంటూ ఆ షోనుంచి వాకౌట్ చేశాడట. దీంతో ధనుష్‌ ఐశ్వర్యకు దూరం అవుతున్నాడని, శృతికి దగ్గరవుతున్నాడనే వార్తలకు బలం చేకూరుతోంది.

ధనుష్, శృతి హాసన్ జంటగా ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన ‘3’ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి మార్చి 30న విడుదలైంది. సినిమా విడుదలకు ముందే ఈ చిత్రంలో ని ‘కొలవెరి’ సాంగు బాగా పాపులర్ అయిన నేపథ్యంలో సినిమా కూడా బాగా ఆడుతుందని భావించినా అంచనాలు తలక్రిందులయ్యాయి. ఈ చిత్రం తెలుగు హక్కులు సొంతం చేసుకున్న నట్టి కుమార్ నష్టాల పాలయ్యాడనే వార్త బాక్సాఫీసు వర్గాల నుంచి వినిపిస్తోంది.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger