పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ షూటింగ్ కోకాపేటలో జరుగుతోంది. సునీల్ మర్యాద రామన్న ఇంటి సెట్ లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. గబ్బర్ సింగ్ షూటింగ్ తుదిదశకు చేరుకుంది. మరోవైపు నిర్మాణ అనంతర కార్యక్రమాలు కూడా జరుపుకుంటోంది. ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమౌతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.
ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ పతాకం పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తుండగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆడియో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చిత్ర నిర్మాత గణేష్ బాబు సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా పబ్లిసిటీ కూడా వినూత్నంగా చేయనున్నట్లు తెలుస్తోంది. పవన్ సరసన అందాల తార శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం హిందీ దబాంగ్ కు రీమేక్. గబ్బర్ సింగ్ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పంజా నిరాశపరచటంతో పవన్ అభిమానుల ఈ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Post a Comment