.
Home » » షాపింగ్‌కి వెళ్లి సెల్ దొంగతనం చేసిన శృతిహాసన్

షాపింగ్‌కి వెళ్లి సెల్ దొంగతనం చేసిన శృతిహాసన్

Written By Unknown on Saturday, 21 January 2012 | 22:49

‘‘చాలా ఎబ్రాసింగ్ గా ఇంది..వేరే వాళ్ళ బ్లాక్ బెర్రీ ఫోన్ తీసుకుని వచ్చేసా..వాళ్ళు నన్ను ఫోన్ దొంగ అనుకుంటారు ’’ అని శ్రుతిహాసన్ ట్విట్ చేసింది. ముంబయ్‌లో షాపింగ్‌కి వెళ్లిన ఆమె అక్కడ తను కొనుక్కోవాల్సినవన్నీ కొనుక్కుని, కొనని ఓ వస్తువును కూడా వెంట తీసుకెళ్లింది. అయితే అది కావాలని చేసినది కాదని శ్రుతి అన్నారు. ఇంతకీ ఏమరుపాటుగా ఈమె తీసుకెళ్లిన వస్తువు మరేదో కాదు ‘మొబైల్ ఫోన్’. క్యాష్ కౌంటర్ దగ్గర పెట్టి ఉంటే... కనీసం ఆ వస్తువు వైపు కూడా చూడకుండా తనదేమోనని చేతబట్టుకుని వెళ్లానని చెప్తోంది. అయితే ఆ విషయాన్ని ఆమే స్వయంగా ట్వీట్ చేసింది.

ఇక ప్రస్తుతం శ్రుతిహాసన్ తమిళ్ ‘3’, తెలుగు ‘గబ్బర్‌సింగ్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. చెన్నయ్‌లో ‘3’కి డబ్బింగ్ చెప్పి, ‘గబ్బర్‌సింగ్’ షూటింగ్‌లో పాల్గొనడానికి ఆమె ముంబయ్ వెళ్లారు. ఒకవేపు షూటింగ్స్‌లో పాల్గొనడం మరోవేపు డబ్బింగ్ చెప్పడం ఒక ఎత్తయితే లగేజీ సర్దుకోవడం మరో సమస్య అవుతోందని ట్వీట్ చేసింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ‘ప్యాకింగ్ కంపెనీ’ ఆరంభిస్తే బాగుంటుందేమో అని కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశింది. శ్రుతి ట్విట్టర్‌కి రెండు లక్షల పై చిలుకు ఫాలోయర్స్ ఉన్నారు. ఇంతమంది తనను అభిమానంగా ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలు తెలిపింది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger