.
Home » » ‘ద డర్టీ పిక్చర్’ వసూళ్లు రూ. 70 కోట్లు

‘ద డర్టీ పిక్చర్’ వసూళ్లు రూ. 70 కోట్లు

Written By Hot nd spicy on Sunday, 18 December 2011 | 07:55

విద్యా బాలన్ హీరోయిన్‌గా నటించిన ‘ద డర్టీ పిక్చర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి రెండు వారాల్లోనే రూ. 70 కోట్ల షేర్ సాధించి, సంచలనం సృష్టించింది. టాప్ బాలీవుడ్ హీరోల సినిమాల తరహాలో ఈ సినిమా చేస్తున్న కలెక్షన్ల మ్యాజిక్‌కి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. రూ. 70 కోట్లలో తొలి వారం వసూళ్లే రూ. 52 కోట్లు కావడం గమనార్హం.
నజీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మి, తుషార్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మిలన్ లూథ్రియా దర్శకుడు. ఏక్తా కపూర్ నిర్మించిన ఈ చిత్రంలో విద్య పోషించిన రేష్మ పాత్ర, ఆ పాత్రలో ఆమె నటన ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఇప్పుడు కేవలం బాలీవుడ్ మాత్రమే కాక దేశవ్యాప్తంగా యువతరం ఆరాధ్య తారగా మారిపోయింది విద్య.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger